రోడ్డు ప్రమాధంలో సీపీఐ నేత అయోధ్య మృతి
సీపీఐ రాష్ట్ర నాయకులు అయోధ్య రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయోధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజక వర్గ కేంద్రంగా రాజాకీయాలు నడిపారు. ఆ ప్రాంతంలో ఆయనకు గట్టి పట్టుంది. ఆయన మొదటి నుండి బడుగు బలహీన వర్గాల కోసం పాటు బడ్డారు. పదవి వున్నా లేకున్నా ఒక మంచి రాజకీయ నేతగా తనను తాను మలచుకున్నారు. కుటుంబ రాజకీయ నేపధ్యం, రాజకీయ వారసత్వం లేక పోయిన పీడిత వర్గాల గుండెల్లో ఎర్ర జెండై ఎదిగారు. ఆయోధ్య మరణం ఆప్రాంత ప్రజలకు, ప్రధానంగా ప్రజా ఉద్యమాలకు తీరని లోటు.



Comments
Post a Comment